![భారత అంతరిక్ష పరిశోధనా రంగంలో సంస్కరణలు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/shivan-2f.jpg?fit=677%2C377&ssl=1)
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను ప్రైవేటుపరం ఎప్పటికీ కాదని సంస్థ చైర్మన్, సెక్రటరీ కె.శివన్ గురువారం స్పష్టంచేశారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో అనేక సంస్కరణలు తీసుకురానున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పేస్ సెక్టార్లో సంస్కరణలు తెస్తున్నట్టు ప్రకటించగానే కొందరు ఇస్రోను ప్రైవేటుపరం చేస్తారనే అపోహలను తెరపైకి తెచ్చారని, ఇస్రో ప్రైవేట్పరం కాదని పదేపదే నేను చెబుతూనే ఉన్నాను.. అని శివన్ పేర్కొన్నారు. ప్రైవేట్వ్యక్తులు కూడా అంతరిక్ష కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలుగా మెకానిజం ఉంటుందని, లేదంటే ఇస్రోనే ఆ పని నిర్వహిస్తుందని వివరించారు. భారత అంతరిక్ష పరిశోధనా రంగంలో నిజమైన గేమ్-చేంజర్గా సంస్కరణలు ఉండబోతున్నాయని చెప్పారు. ప్రతిపాదిత స్పేస్ యాక్టివిటీ బిల్లు ముసాయిదా దాదాపు తుది దశలో ఉందని, త్వరలోనే ఆమోదం కోసం కేబినెట్ ముందుకు వస్తుందని చెప్పారు.