Breaking News

బ్రిడ్జి కట్టి బాధలు తీర్చండి

బ్రిడ్జి కట్టి బాధలు తీర్చండి

సారథి న్యూస్​, దేవరకద్ర: కొత్తకోట మండలం కనిమెట్ట– జంగమాయపల్లి గ్రామాల బ్రిడ్జిని మంజూరుచేసి వెంటనే పనులు మొదలుపెట్టాలని మంత్రి హరీశ్​రావును దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటీవల కురుస్తున్న భారీవర్షాలకు ఆ రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయని మంత్రి దృష్టికి తెచ్చారు. అలాగే దేవరకద్ర మండలం పేరూర్ లిఫ్టును మంజూరుచేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరగా.. మంత్రి హరీశ్ రావు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి తెలిపారు. అనంతరం మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కలిశారు. సరళాసాగర్​, కోయిల్​సాగర్​ ప్రాజెక్టులను టూరిజం స్పాట్​గా చేయాలని కోరారు. స్పీడ్ బోటింగ్ సిస్టం, హరిత రెస్టారెంట్, గెస్ట్ హౌస్ నిర్మించాలని కోరారు.

మంత్రి శ్రీనివాస్​గౌడ్​ను కలిసి వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి