Breaking News

బోర్ కొట్టే అమ్మాయి పాత్రలో..

బోర్ కొట్టే అమ్మాయి పాత్రలో నిత్య

నేచురల్ గా నటించడం.. పెద్దగా మేకప్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం నిత్యామీనన్ స్టైల్. అంతేకాదు రోల్​ నచ్చితేనే ఆ సినిమాకు సై అంటుంది. అలాగే డిఫరెంట్ పాత్రలకే ప్రయారిటీ ఇస్తుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది కనుకే తక్కువ సమయంలోనే మంచి నటిగా నిలదొక్కుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగై భాషలకు సంబంధించిన సినిమాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు రీసెంట్​గా ఆంథో మార్కోని దర్శకత్వంలో మలయాళ సినిమాలో నటించనుంది.

ఆంథో జోసెఫ్ నిర్మించనున్న ఈ చిత్రంతో వీఎస్‌ ఇందూ దర్మకురాలిగా పరిచయం కానుంది. అయితే గతేడాదే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు వర్క్ పూర్తయినా షూటింగ్ మాత్రం కరోనా కారణంగా ఆలస్యమైంది. ఇప్పుడు అతిత్వరలోనే మూవీ సెట్స్ పైకి రానుందట. ఇందులో తన క్యారెక్టర్ గురించి నిత్య చెబుతూ.. ‘ఈ మూవీలో సన్నగా కనిపిస్తాను. క్యారెక్టర్ ను నేను చాలా లైక్ చేశాను.. ఇందులో పాత్రలన్నీ రియలిస్టిక్ గా ఉంటాయి. నేను చేసే పాత్ర వింతగా ఉంటుంది.. బోరింగ్ జీవితాన్ని గడిపే సాధారణ అమ్మాయి పాత్ర పోషిస్తున్నాను..’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నాడు.