Breaking News

బీజేపీ బలపడుతోంది

బీజేపీ బలపడుతోంది

సారథి న్యూస్​, కర్నూలు: క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే కార్యకర్తలు ఉన్నారని, భవిష్యత్‌లో రాష్ట్రంలో వచ్చేది బీజేపీయేనని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ ఉద్ఘాటించారు. శనివారం సాయంత్రం నగరంలోని లక్ష్మిహోటల్‌ పక్కన పార్టీ కర్నూలు జిల్లా ఆఫీసును ఎంపీ టీజీ వెంకటేష్‌తో పాటు సీనియర్‌ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి, రాష్ట్ర సంఘటన కార్యదర్శి మధుకర్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ టీజీ వెంకటేష్‌ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో దేశం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని, రాష్ట్రంలోనూ కేంద్ర పథకాలు అర్హుందరికీ అందుతున్నాయని చెప్పారు.

ప్రాంతీయ పార్టీతో పోటీగా సభ్యత్వు బీజేపీ సాధించిందని, రాబోయే కాంలో రాష్ట్రంలో బీజేపీ కీలకంగా మారనుందని చెప్పారు. కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలకు రాష్ట్ర ప్రజలు ఆకర్షితువుతున్నారని, అందుకే బీజేపీ సభ్యత్వానికి ఆదరణ పెరుగుతోందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.