Breaking News

బిజినేపల్లి గురుకులాన్ని ఇక్కడే కొనసాగించండి

బిజినేపల్లి గురుకులాన్ని ఇక్కడే కొనసాగించండి

సారథి న్యూస్, బిజినేపల్లి: తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ డాక్టర్​ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను నాగర్​కర్నూల్ ​ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మంగళవారం హైదరాబాద్​లోని ఆయన చాంబర్​లో కలిశారు. బిజినేపల్లి గురుకులాన్ని వనపర్తి జిల్లా కేంద్రానికి తరలించవద్దని కోరారు. ప్రస్తుతం మండల కేంద్రంలో ఉన్న రెసిడెన్షియల్ స్కూలులో తరగతి గదులతో పాటు టాయిలెట్స్, డైనింగ్ హాల్ బిల్డింగ్ ఎక్స్​టెన్షన్ ​పనులు పూర్తయ్యాయని సెక్రటరీ దృష్టికి తెచ్చారు. అన్నివిధాలుగా అభివృద్ధి చెందిన మండలంలో విద్యావ్యవస్థ ప్రతిష్ట కోసం కృషిచేయాలని కోరారు. పేరెంట్స్​కోరిక మేరకు బిజినేపల్లిలోనే కొనసాగించాలని కోరారు. అందుకు గురుకులాల సెక్రటరీ డాక్టర్​ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్​సానుకూలంగా స్పందించినట్లు ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గురుకుల స్కూలును ఇక్కడే కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు.