Breaking News

బక్రీద్​ శాంతియుతంగా జరుపుకోండి

శాంతియుతంగా బక్రీద్​

సారథి న్యూస్, బెజ్జంకి: ముస్లిం సోదరులు బక్రీద్​ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని చేర్యాల సీఐ శ్రీనివాసరెడ్డి సూచించారు. బుధవారం ఆయన కరీంనగర్​ జిల్లా చేర్యాలలో ముస్లిం మత పెద్దలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. గోవులను అక్రమంగా రవాణాచేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకోసం ప్రత్యేకంగా చెక్​పోస్టులు ఏర్పాటుచేశామన్నారు. మత ఘర్షణలు ప్రేరేపించేలా ఎవరైనా సోషల్​మీడియాలో పోస్టులు పెడితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో చేర్యాల ఎస్సై మోహన్ బాబు, చేర్యాల తాజుమ్ ప్రెసిడెంట్ అబ్దుల్ కరీం, వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ సలీం, ముస్లిం పెద్దలు రహీం, షరీఫ్, రఫత్ తదితరులు పాల్గొన్నారు.