Breaking News

ఫుట్​ బాల్​ కు సాయం చేయండి

ఫుట్​ బాల్​ కు సాయం చేయండి
  • కేంద్ర క్రీడామంత్రి కిరణ్​ రిజిజు

న్యూఢిల్లీ: దేశంలో ఫుట్​ బాల్​ ను మరింత మెరుగుపర్చేందుకు టాప్ కార్పొరేట్ కంపెనీలు, స్టేట్, డిస్ర్టిక్ బాడీలు ఇతోధికంగా సాయం చేయాలని కేంద్ర క్రీడామంత్రి కిరణ్ రిజిజు కోరారు. గ్రాస్ రూట్ లెవెల్​లో ఈ క్రీడను అభివృద్ధి చేయాలని సూచించారు. భారత్​ లో ఫుట్​ బాల్​ కల్చర్​ ను ఎలా వృద్ధి చేయాలనే దానిపై మంత్రి తన దృక్పథాన్ని వెల్లడించారు.

‘పాఠశాల స్థాయిలో ఫుట్​ బాల్​ను ప్రవేశపెట్టాలి. స్థానికంగా లీగ్​ లు జరిగేలా ప్రోత్సహించాలి. దేశ వ్యాప్తంగా ఉన్న పిల్లలో ఈ క్రీడకు సంబంధించిన మెళకువలు నేర్పించాలి. ఒకసారి మాస్​ గా ఈ క్రీడను జనాల్లోకి తీసుకెళ్తే ఆ తర్వాత నైపుణ్యం ఉన్న వారిని ఎంపిక చేసుకోవచ్చు. వాళ్లు ఎలైట్ ఫుట్​ బాల్​ గా తీర్చిదిద్దొచ్చు. ప్రభుత్వపరంగా అన్ని వనరులను మేం సమకూరుస్తాం.

ఆర్థికంగా కూడా చేయూత అందిస్తాం. కానీ ఫుట్​ బాల్​ బాడీస్ రాష్ట్ర, జిల్లా స్థాయిలో నిరంతరం టోర్నీలను ఏర్పాటుచేసే విధంగా ప్రణాళికలు రచించాలి. తద్వారా ప్రజాదరణ పెరిగి నైపుణ్యం ఉన్న క్రీడాకారులు అందుబాటులోకి వస్తారు’ అని రిజిజు వ్యాఖ్యానించాడు. అన్ని స్థాయిల్లో లీగ్​ ను నిర్వహించేందుకు అవసరమైన స్పాన్సర్​ షిప్స్​ ఇవ్వాలని కార్పొరేట్ కంపెనీలను కోరారు. ఇందుకు సంబంధించిన రోడ్​ మ్యాప్​ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రిజిజు స్పష్టంచేశారు.