Breaking News

ప్రతి చెరువును నింపుతాం

ప్రతి చెరువును నింపుతాం
  • చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్

సారథి న్యూస్​, చొప్పదండి: ప్రతి చెరువును నింపి పంటలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే సీఎం కేసీఆర్​ లక్ష్యమన్నారు. సోమవారం ఆయన తన క్యాంపు ఆఫీసులో ఆరు మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులతో నీటిపారుదల అంశంపై సమీక్షించారు. ఇప్పటికే చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలం నారాయణపూర్ చెరువు, కొడిమ్యాల మండలం మైసమ్మ చెరువు, పోతారం చెరువు ద్వారా సాగునీటిని అందిస్తున్నామని చెప్పారు. అసంపూర్తిగా ఉన్న ఎల్లంపల్లి ఎడమ, కుడి కాల్వల నిర్మాణంపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రవీందర్ రెడ్డి, గుర్రం భూమరెడ్డి పాల్గొన్నారు.