![పోలీసు సిబ్బందికి వైద్యపరీక్షలు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/04/WhatsApp-Image-2020-04-28-at-12.31.09-PM.jpeg?fit=1152%2C864&ssl=1)
సారథి న్యూస్, మహబూబ్ నగర్: కరోనా మహమ్మారి నిర్మూలనలో నిర్వీరామంగా పనిచేస్తున్న జిల్లా పోలీసు సిబ్బందికి వైద్యపరీక్షలు నిర్వహించాలని మహబూబ్ నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరి నిర్ణయించారు.
మంగళవారం ఈ మేరకు జిల్లా కేంద్రంలోని నవోదయ, సుశ్రుత, నేహా సన్ షైన్ ఆస్పత్రుల్లో సిబ్బందికి జరుగుతున్న వైద్యపరీక్షల వివరాలను ఆరాతీశారు. పోలీసు సిబ్బంది ఆరోగ్యమే ముఖ్యమని.. అందుకోసమే వారికి కూడా వైద్యపరీక్షలు చేస్తున్నామని ఏఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు తెలిపారు.