Breaking News

పశ్చిమబెంగాల్​ పీసీసీ చీఫ్​ మృతి

కాంగ్రెస్​ నేత సోమెన్​ మృతి

కోల్​కతా: పశ్చిమ బెంగాల్​ పీసీసీ అధ్యక్షుడు సోమెన్​ మిత్రా (78) గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన కొంతకాలంగా సీవోపీడీ ( క్రానిగ్​ అబ్​స్క్రక్టివ్​ పుల్​మోనరీ వ్యాధి)తో బాధపడుతూ కోల్​కతాలోని ఓ ప్రైవేట్​ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. కాగా గురువారం తెల్లవారుజామున ఆయన పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. సోమెన్​ కరోనాతో మృతిచెందారన్న వార్తల్లో నిజం లేదని ఆసపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఆయనకు కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్​ వచ్చిందని తెలిపాయి. సోమెన్​ మృతికి కాంగ్రెస్​ అధినేత్రి సోనియాగాంధీ, యువనేత రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ తదితరులు సంతాపం తెలిపారు. టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి, వర్కింగ్​ ప్రెసిడెంట్​ రేవంత్​రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఆయన మృతికి సంతాపం తెలిపారు.