సారథి న్యూస్, మెదక్: పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా వ్యాధినిరోధక టీకాల పంపిణీ ప్రక్రియను ఈనెల 10వ తేదీ వరకు పూర్తిచేయాలని మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి జిల్లా పశువైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. గ్రామాల్లో పాడి రైతులు, మేకలు, గొర్రెల కోసం హరితహారం కార్యక్రమంలో తుమ్మ, సుబాబుల్, అవిసె, సూపర్ నేవియర్ గడ్డివేయాలని సూచించారు. అధికారులు ఈ సీజన్లో రైతులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పాడి పశువులకు బీమా చేయించే విషయమై అవగాహన కల్పించాలని కోరారు. జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్లు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
- June 3, 2020
- మెదక్
- లోకల్ న్యూస్
- COLLECTOR
- VETARINARY
- కలెక్టర్
- గాలికుంటు
- మెదక్
- Comments Off on పశువులకు టీకాలు తప్పనిసరి