![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/POWERSTARR-TRAILERGHGGG.jpg?fit=322%2C156&ssl=1)
సంచలన దర్శకుడు ఆర్జీవీకి చుక్కెదురైంది. రూ. 25 చెల్లించి పవర్స్టార్ ట్రైలర్ను చూడాలంటూ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్కు కొంతమంది టిక్కెట్లు కూడా కొన్నారు. కాగా ట్రైలర్ను అఫిషియల్గా రిలీజ్ చేయకముందే కొందరు ఇంటర్నెట్లో లీక్చేశారు. నిజానికి బుధవారం ఉదయం 11:00 గంటలకు ట్రైలర్ విడుదల కావాల్సివుంది. ట్రైలర్ అంతకంటే ముందే నెట్టింట్లో విడుదలైంది. విడుదలకు ముందే లీకు కావడంతో వర్మ విధిలేక ట్రైలర్ ని ఫ్రీగా యూటూబ్లో విడుదల చేశారు. ట్రైలర్ కోసం డబ్బులు చెల్లించిన వారికి తిరిగి డబ్బులు చెల్లిస్తాం అని చెప్పారు. ట్రైలర్ టికెట్స్ పెద్దగా అమ్ముడు కాకపోవడంతో వర్మ లీకు నాటకం ఆడారేమోనని కొందరు అనుమానిస్తున్నారు. లీక్ అనగానే జనాలు ఎగబడి చూస్తారు. ఆ విధంగా ట్రైలర్ కి భారీ వ్యూస్ దక్కే అవకాశం ఉంది. కాబట్టి కావాలనే వర్మ ట్రైలర్ లీకు చేయించాడని తెలుస్తుంది.