Breaking News

పకడ్బందీగా ఆస్తి వివరాల నమోదు

పకడ్బందీగా ఆస్తి వివరాల నమోదు

సారథి న్యూస్, బిజినేపల్లి: గ్రామంలోని ఇండ్లు, ఇత‌ర అన్ని ర‌కాల నిర్మాణాల‌కు కూడా భ్రదత కల్పిస్తూ ప‌ట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకోసం అన్ని ఇండ్లను, ప్రభుత్వ, ప్రైవేట్​ఆస్తుల వివరాలను ధరణి పోర్టల్ లో పొందుపర్చుకోవాలని నాగర్​కర్నూల్​జిల్లా బిజినేపల్లి ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న ఆస్తి ఆన్​లైన్​ప్రక్రియను క్షేత్రస్థాయిలో పాలెం గ్రామంలో ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ ఆకస్మికంగా పరిశీలించారు. గ్రామంలో ఉన్న ఇండ్లు, ప్రభుత్వ, ప్రైవేట్​ఆస్తుల వివరాలను ధరణి పోర్టల్ లో పొందుపరచాలని సూచించారు.

సంబంధిత గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ఈ సర్వేను అక్టోబర్ 10వ తేదీ నాటికి పూర్తిచేయాలని కోరారు. ధరణి యాప్ లో ఆస్తుల వివరాలను నమోదు చేయడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు తెలియజేయాలని అధికారులు ప్రజాప్రతినిధులకు సూచించారు. గ్రామాల్లో ఉన్న స్కూళ్లు, దేవాలయాలు, మసీదులు, చర్చిల వివరాలను తప్పనిసరిగా పొందుపర్చాలన్నారు. ఆస్తులకు సంబంధించిన యజమాని వివరాలు, ఫొటోలను అప్ లోడ్ చేయించుకోవాలని సూచించారు. నమోదు ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ వసంత, వీఆర్ఏ పల్లవి, పంచాయతీ సిబ్బంది అమరేందర్, వెంకటేష్, వార్డు సభ్యులు పరశురాములు తదితరులు పాల్గొన్నారు.