Breaking News

పందులకు పెట్టిన వైరు.. ప్రాణాలు తీసింది

పందులకు పెట్టిన వైరు.. తండ్రికొడుకుల ప్రాణాలు తీసింది

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: కరెంట్ ​షాక్​తో తండ్రి కొడుకులు ప్రాణాలు వదిలారు. ఈ విషాదకర సంఘటన గురువారం రాత్రి మెదక్​జిల్లా పెద్దశంకరంపేట మండలం కొలపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఇస్కపాయల తండా పంచాయతీ పరిధిలోని కొలపల్లితండాకు చెందిన ధారవత్ హర్యానాయక్(51) కొలపల్లికి చెందిన చాకలి సాయిలు పొలాన్ని కౌలుకు పంట సాగు చేస్తున్నాడు. గురువారం రాత్రి పొలాన్ని నీళ్లు చూసేందుకు వెళ్లాడు. పక్క పొలానికి చెందిన చాకలి లింగం అడవి పందుల కోసం కరెంట్ వైర్ బిగించాడు. రాత్రి వచ్చిన హర్యానాయక్​ విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రిని వెతుక్కుంటూ వచ్చిన, అతని ఒక్కగానొక్క కొడుకు రాజు(18)తో పాటు హర్యానాయక్ ​అన్న కొడుకు, నవీన్ ను తీసుకుని తండ్రిని వెతుక్కుంటూ వచ్చారు. తండ్రిని చూసి అటుగా వెళ్లిన రాజు అదే విద్యుత్ వైర్ కు తగిలి చనిపోయాడు. నవీన్ తండాకు వెళ్లి సమాచారం అందించారు. స్థానికులంతా హుటాహుటిన కదిలొచ్చారు. అప్పటికేవారు విగతజీవులుగా మారారు. ఘటనస్థలాన్ని మెదక్ ​డీఎస్పీ కృష్ణమూర్తి, అల్లాదుర్గం సీఐ రవి, ఎస్సై సత్యనారాయణ పరిశీలించారు.

హర్యానాయక్
రాజు