Breaking News

న్యూజిలాండ్ కు హెస్సన్

న్యూజిలాండ్ కు హెస్సన్

న్యూజిలాండ్ కు హెస్సన్..

ఐపీఎల్‌ ఫ్రాంచైజీ బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ ఫ్రాంచైజీ బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ క్రికెట్‌ డైరెక్టర్‌ మైక్‌ హెస్సన్‌ ఎట్టకేలకు

న్యూజిలాండ్‌కు వెళ్లిపోయాడు. ఐపీఎల్‌ కోసం మార్చి 5న ఇండియాకు వచ్చిన అతను నేషనల్‌వైడ్‌ లాక్‌ డౌన్‌తో

ఇక్కడే చిక్కుకుపోయాడు. దాదాపు నెల రోజులుగా బెంగళూరులోనే ఉంటున్న హెస్సన్‌ మంగళవారం తిరిగి స్వదేశానికి వెళ్లిపోయాడు.

వచ్చేనెల 3 వరకు ఇండియాలో లాక్‌ డౌన్‌ ఉన్నా న్యూజిలాండ్‌ గవర్నమెంట్‌ మాత్రం ట్రావెల్‌ ఆంక్షలను కొద్దిగా సడలించింది.

‘ముంబై విమానాశ్రయానికి చేరుకోవడానికి బస్‌లో ఒక రోజు గడిపిన తర్వాత ఎంత అద్భుతమైన దృశ్యం. ఫ్లయ్‌ ఎయిర్‌ న్యూజిలాండ్‌ సేవలు అద్భుతం. మమ్ముల్ని తిరిగి తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

ఇండియా, న్యూజిలాండ్‌ ప్రైమినిస్టర్స్‌, ఇండియాలో కివీస్‌ ఎంబసీ అధికారులు, న్యూజిలాండ్‌ ఫారిన్ ఎఫైర్స్‌ మినిస్ట్రీకి ధన్యవాదాలు’ అంటూ హెస్సన్‌ ట్వీట్‌ చేశాడు.