Breaking News

నిలోఫర్ మాజీ సూపరింటెండెంట్ సుదర్శన్ రెడ్డి మృతి

నిలోఫర్ మాజీ సూపరింటెండెంట్ సుదర్శన్ రెడ్డి మృతి
  • చిన్నపిల్లల డాక్టర్​గా విశేష గుర్తింపు.

సారథి న్యూస్, హైదరాబాద్ : నిలోఫర్‌ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్‌, ప్రముఖ వైద్యులు డాక్టర్ పట్లోళ్ల సుదర్శన్‌రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతిచెందారు. ఉస్మానియా మెడికల్​ కాజీలో ప్రొఫెసర్​ గా పనిచేశారు. నిలోఫర్ ఆస్పత్రికి సూపరింటెండెంట్ పనిచేసి నాలుగేళ్ల క్రితం పదవీ విరమణ పొందారు. ఖైరతాబాద్​ లో క్రిష్ణ చిల్డ్రన్స్ క్లీనిక్​ ను కొనసాగిస్తూ ఓ ప్రముఖ ఆస్పత్రిలో కూడా ఆయన సేవలందించారు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతూ హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. చిన్నపిల్లల వైద్య నిపుణుడిగా సుదర్శన్‌రెడ్డి విశేష గుర్తింపు పొందారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.