Breaking News

‘నాగార్జున’ బ్రాండ్ అండాసిడ‌ర్ గా వ‌రుణ్ తేజ్


మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ వ‌రుస బ్లాక్ బ‌స్టర్స్​తో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఇటీవ‌లే వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించిన గ‌ద్దలకొండ గ‌ణేశ్ బాక్సాఫీస్ వద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ప‌లు దేశీయ బ్రాండ్లకు అండార్స్ చేస్తున్న వ‌రుణ్ తేజ్ తాజాగా ప్రముఖ సిమెంట్ బ్రాండ్, నాగార్జునకు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉండేందుకు అంగీక‌రించారు. దీనికి సంబంధించిన పోస్టర్​ కు నాగార్జున సిమెంట్స్ వారు అధికారికంగా విడుద‌ల చేశారు. ‘మీ అనుంబంధ‌మే నా బ‌లం, ప్రతిసౌధంలో మొన‌గాడై నిలిచి’ అన్న సందేశంతో ఈ పోస్టర్​ను విడుదల చేశారు. ప్రస్తుతం వ‌రుణ్ తేజ్ త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం బాక్సింగ్ లో స్పెష‌ల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వరలోనే అధికారికంగా రానున్నాయి.