Breaking News

నరేంద్ర మోడీ కాదు.. సరండర్‌‌ మోడీ

న్యూఢిల్లీ: ఇండియా – చైనా బోర్డర్‌‌లో నెలకొన్న పరిస్థితులపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీ కేంద్రంపై విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక న్యూస్‌ ఆర్టికల్‌ను ట్విట్టర్‌‌లో షేర్‌‌ చేసిన రాహుల్‌ ‘నరేంద్ర మోడీ నిజానికి సరండర్‌‌ మోడీ’ అని ట్వీట్‌ చేశారు. చైనా – ఇండియా మధ్య బార్డర్‌‌ ఇష్యూ జరుగుతున్న మొదటి నుంచీ రాహుల్‌ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆల్‌ పార్టీ మీటింగ్‌ అయిన తర్వాత కూడా సైనికులు ఎందుకు.. ఎక్కడ చనిపోయారు? అంటూ ట్వీట్​లు చేశారు. ప్రభుత్వానికి దాడి గురించి ముందే తెలిసినా స్పందించలేదని విమర్శించారు. కాగా.. రాహుల్‌ గాంధీకి అమిత్‌ షా గట్టి కౌంటర్‌‌ ఇచ్చారు. జవాన్​ తండ్రి మాట్లాడిన వీడియోను పోస్ట్‌ చేసి బదులిచ్చారు.