![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/cotton.jpeg?fit=1152%2C864&ssl=1)
సారథి న్యూస్, వనపర్తి: రైతులకు నకిలీ విత్తనాలు, పురుగు మందులు అంటగడితే కఠిన చర్యలు తప్పవని వనపర్తి టౌన్ ఎస్సై వెంకటేశ్ గౌడ్ హెచ్చరించారు. శనివారం జిల్లా ఎస్పీ అపూర్వరావు ఆదేశాల మేరకు పలువురు సీడ్స్, ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ గుర్తింపు ఉన్న సీడ్స్, ఎరువులను మాత్రమే అమ్మాలని సూచించారు. వ్యాపారులు ఎవరైనా మోసం చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని రైతులను కోరారు.