Breaking News

నకిలీ విత్తనాలు అంటగడితే చర్యలు

సారథి న్యూస్​, వనపర్తి: రైతులకు నకిలీ విత్తనాలు, పురుగు మందులు అంటగడితే కఠిన చర్యలు తప్పవని వనపర్తి టౌన్​ ఎస్సై వెంకటేశ్​ గౌడ్ హెచ్చరించారు. శనివారం జిల్లా ఎస్పీ అపూర్వరావు ఆదేశాల మేరకు పలువురు సీడ్స్​, ఫర్టిలైజర్​ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ గుర్తింపు ఉన్న సీడ్స్​, ఎరువులను మాత్రమే అమ్మాలని సూచించారు. వ్యాపారులు ఎవరైనా మోసం చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని రైతులను కోరారు.