Breaking News

తారక్​కు జోడిగా కియారా

తారక్​ సినిమాలో కియారా

ఆర్​ఆర్​ఆర్​ తర్వాత జూనియర్​ ఎన్టీఆర్​ తివ్రిక్రమ్​ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో తారక్​ కు జోడీగా బాలీవుడ్​ భామ కియారా అద్వానీ నటించనున్నట్టు సమాచారం. ‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ మరోసారి నటిస్తున్నాడు. ఈ ఏడాది వేసవిలో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ ‌ప్రారంభిస్తామని చిత్రయూనిట్​ ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియదు. కాగా ఇందులో ఓ పవర్ ఫుల్​ ​పాత్రలో బాలీవుడ్​ నటుడు సంజయ్​ దత్​ నటించనున్నట్టు టాక్​. హారికా, హాసిని, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి.