ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తివ్రిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో తారక్ కు జోడీగా బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటించనున్నట్టు సమాచారం. ‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ మరోసారి నటిస్తున్నాడు. ఈ ఏడాది వేసవిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని చిత్రయూనిట్ ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియదు. కాగా ఇందులో ఓ పవర్ ఫుల్ పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించనున్నట్టు టాక్. హారికా, హాసిని, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి.
- August 2, 2020
- Archive
- Top News
- సినిమా
- Comments Off on తారక్కు జోడిగా కియారా