![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/trishaaaaff.jpg?fit=700%2C467&ssl=1)
నాని, శ్రద్ధా శ్రీనాథ్ హీరోహీరోయిన్లుగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జెర్సీ చిత్రం భారీ విజయం నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం.. విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నది. ప్రస్తుతం జెర్సీ చిత్రాన్ని తమిళం, హిందీ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. హిందీ రీమేక్లో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండగా.. తమిళంలో విష్ణు విశాల్ చేస్తున్నాడు. అయితే జెర్సీలో కథనాయికగా చేయడానికి హీరోయిన్స్ ఎవరూ ముందుకు రావటం లేదట. అందుకు కారణం ఇందులో హీరోయిన్ ఓ బాబుకు తల్లిగా కనిపించడమే. నయనతార, అమలాపాల్, హన్సిక వంటి హీరోయిన్స్ ఈ పాత్రను చేసేందుకు తిరస్కరించడంతో చివరకు త్రిష కన్ఫార్మ్ అయినట్టు సమాచారం.