![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/CS-SOMESHKUMARFF.jpg?fit=271%2C186&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: గ్రూప్-2లో ఎంపికైన డిప్యూటీ తహసీల్దార్లకు (ప్రొబెషనరీ డిప్యూటీ తహసీల్దార్లు/డీటీలు) పోస్టింగ్లపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 259 మంది ఎంపిక కాగా 257 మంది మాత్రమే జాయినింగ్ ఆర్డర్లు సమర్పించారు. వీరిని రెండ్రోజుల్లో విధుల్లోకి తీసుకోవాలంటూ ఉమ్మడి జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ బుధవారం ఆదేశించారు. 2016లో ఎంపికైన వీరికి గతేడాది నవంబరులో ప్రభుత్వం అపాయింటుమెంట్లు కల్పించింది. పోస్టింగ్ల కోసం వీరంతా ఎదురుచూస్తున్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి త్వరితగతిన పోస్టింగ్లు కల్పించేందుకు చర్యలు చేపట్టారు.