Breaking News

ట్రాఫిక్​ ఆంక్షలు సడలించండి

సారథి న్యూస్​, కొత్తగూడెం: జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలో ట్రాఫిక్​ ఆంక్షలను సడలించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ ఎస్పీ సునిల్​​ దత్తు​ను మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. కొత్తగూడెం వ్యాపారానికి, హోల్ సెల్​ దుకాణాలకు కేంద్రబిందువుగా ఉందని, వాహనాలకు చలాన్లు వేస్తే షాపులకు ఎవరూ కావడం లేదని వివరించారు. అసలే కరోనా, లాక్​ డౌన్​ సమయంలో గిరాకీ రాక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని ఎస్పీ దృష్టికి తెచ్చారు. వ్యాపారులకు సహకరిస్తామని ఎస్పీ బీజేపీ నాయకులకు భరోసా ఇచ్చారు. వినతిపత్రం అందజేసిన వారిలో బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, లక్ష్మణ్ అగర్వాల్ ఉన్నారు.