Breaking News

ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి

ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి
  • ఎండుమిర్చిన తీసుకెళ్తుండగా ఘటన.. మృతులు రైతులు

సారథి న్యూస్, రంగారెడ్డి: అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు రైతులు మృతిచెందారు. ఈ సంఘటన మాడ్గుల పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం.. నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం, శాంతిగూడెం గ్రామానికి చెందిన రామచంద్రయ్య(45), సుబయ్య(36) కలిసి ఎండు మిర్చిని ట్రాక్టర్​ లో ఇర్విన్ గ్రామానికి తీసుకొచ్చారు. తిరిగి వెళ్తుండగా అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తాపడింది.

ఈ ఘటనలో రామచంద్రయ్య, సుబ్బయ్య గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో శాంతిగూడెంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కల్వకుర్తి ప్రభుత్వాసుప్రతికి తరలించారు.