![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/05/rs.jpeg?fit=1199%2C783&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి.. లాక్ డౌన్ నేపథ్యంలో వాయిదాపడిన పదో తరగతి పరీక్షలు జూన్ 8 నుంచి నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణ.. కరోనా వైరస్ కట్టడి చర్యలపై గురువారం మాసాబ్ట్యాంక్లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిస్టినా చొంగ్తుతో సమీక్షించారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యాలయాల్లో 2949 మంది విద్యార్థులు ఉన్నారని అన్ని జిల్లాలో వీరికోసం 38 కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నామని వివరించారు. హాస్టళ్లు, ఎగ్జామ్ సెంటర్లలో శానిటైజర్ వాడేలా, మాస్క్ లు కట్టుకునేలా చూడాలని సూచించారు.