Breaking News

టెక్నికల్ అసిస్టెంట్స్ ను ఆదుకోవాలి

సారథి న్యూస్​, శ్రీకాకుళం: సివిల్ సప్లయీస్​ డిపార్ట్​మెంట్​ ఆధ్వర్యంలో పీపీసీ కేంద్రాల్లో పనిచేసిన టెక్నికల్ అసిస్టెంట్స్ ను ప్రభుత్వం కంటిన్యూ చేసి ఆదుకోవాలని టెక్నికల్ అసిస్టెంట్స్​ సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. మంగళవారం మంత్రి కృష్ణదాసును కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. తాము ప్రైవేట్ జాబ్స్ వదులుకొని ఇందులో కొనసాగుతున్నామని, ప్రభుత్వ సంస్థ కావడంతో తమకు భవిష్యత్​ ఉంటుందని భావించామన్నారు. మూడునెలల తర్వాత హోల్డ్​లో పెట్టడంతో ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఏల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు హారేరాం, లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు శ్యాం, ఈశ్వర్​రావు, సురేష్, కృష్ణ పాల్గొన్నారు.