Breaking News

టీలో మత్తుమందు ఇచ్చి అత్యాచారం

తూర్పుగోదావరి: ఎన్ని కఠినచట్టాలు వచ్చినా మృగాళ్ల ఆలోచనలో ఏ మార్పు రావడం లేదు. తాజాగా ఓ దుర్మార్గుడు ఓ బాలికకు టీలో మత్తుమందు ఇచ్చి ఆమెపై లైంగికదాడికి ఒడిగట్టాడు. ఈ దారుణఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మామాడికుదురు మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. ఓ గ్రామానికి చెందిన బాలిక కుటుంబంతో అదే గ్రామానికి చెందిన గుబ్బల రాజేంద్ర కుమార్​ (21) సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం రాజేంద్ర బాలిక ఇంటికి వెళ్లాడు. అనంతరం బాలికకు, ఆమె తల్లికి టీలో మత్తుమందు కలిపి ఇచ్చాడు. వాళ్లు మత్తులోకి జారుకున్నాక బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు రాజేంద్రను అరెస్ట్‌ చేశారు.