Breaking News

టీమిండియాను ఓడించాలి

టీమిండియాను ఓడించాలి

– ఆసిస్ కోచ్ జస్టిన్ లాంగర్

మెల్​ బోర్న్​: టెస్టుల్లో నంబర్​ వన్​ ర్యాంక్ దక్కినప్పటికీ ఇండియా గడ్డపై టీమిండియాను ఓడించడమే తమ అసలు టార్గెట్ అని ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ వెల్లడించాడు. లేదంటే తమ టాప్ ప్లేస్ మరోసారి ప్రమాదంలో పడినట్టేనని హెచ్చరించాడు.

‘ఈ ర్యాంక్లను ఎలా ప్రకటించారో మేం గుర్తించగం. అయితే ఈ సమయంలో టాప్ ప్లేస్ రావడం మా ముఖాల మీదకు నవ్వు తెప్పించింది. మేం కోరుకున్నట్లుగా మంచి టీమ్​ గా తయారుకావడానికి చాలా శ్రమించాం. కానీ  రెండేళ్లుగా మైదానంలోపలా, వెలుపలా మా ప్రదర్శన అంతా బాగాలేదు. అయినా సరే మేం చేరాల్సిన లక్ష్యాలు అలాగే ఉన్నాయి. వరల్డ్ టెస్ట్ చాంపియన్​ షిప్​ సాధించాలి.

ఇండియాను వాళ్ల గడ్డపై ఓడించాలి. వాళ్లు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఓడించాం. అత్యుత్తమైన టీమ్​ ను ఓడిస్తేనే మనం ఉత్తమమని తెలుస్తుంది’ అని లాంగర్ వ్యాఖ్యానించాడు. నంబర్​ వన్​ ర్యాంక్ దక్కడం గొప్ప విషయమే అయినా ఈ స్థానంలో ఉండడం వల్ల ఎప్పుడూ వేటాడడం తప్పదన్నాడు. ఇక ఫించ్ నేతృత్వంలోని వైట్​ బాల్​ టీమ్ టీ 20 వరల్డ్​ కప్​ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశాడు.