Breaking News

టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా

టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా

అమరావతి: టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి చైర్మన్‌కు తన రాజీనామా పత్రాన్ని పంపించారు. రాష్ట్రంలో టీడీపీ చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. టీడీపీ కొద్దిరోజులుగా ఏపీ అభివృద్ధికి అడ్డుపడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలను టీడీపీ అడ్డుకుంటుందని పేర్కొన్నారు.