![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/ashokk-fff.jpg?fit=1280%2C720&ssl=1)
జైపూర్: రాజస్థాన్లో బీజేపీ తనదైన శైలిలో రాజకీయాలు ప్రారంభించింది. సీఎం అశోక్ గెహ్లాట్ను పదవినుంచి దించడమే లక్ష్యంగా ఆపార్టీ పావులు కదుపుతున్నది. ఇందులో భాగంగానే డిప్యూటీ సీఎం వెనుక ఉండి మంత్రాంగం నడుపుతున్నది. తన ఎమ్మెల్యేలను కాపాడుకోలేక కాంగ్రెస్పార్టీ కకావికలమవుతుంది. అయితే తాజాగా సీఎం అశోక్ గెహ్లాట్ అనుచరులైన ఇద్దరిపై ఐటీదాడులు జరుగడం బీజేపీ వ్యూహంలో భాగమేనని పలువురు భావిస్తున్నారు. సోమవారం కాంగ్రెస్ నేతలు, సీఎం అశోక్ గెహ్లాట్కు సన్నిహితులైన ధర్మేంద్ర రాథోడ్, రాజీవ్ అరోరా నివాసాలపై ఐటీ దాడులు జరిగాయి. రాష్ట్రంలో గంట గంటకు ఉత్కంఠ భరితంగా రాజకీయాలు మారుతున్నాయి. రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తన వెంట 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని మీడియాకు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తమకు 109 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని చెబుతుంది. ఏ నేపథ్యంలో మధ్యప్రదేశ్లో క్యాంప్ రాజకీయాలకు తెరలేచే అవకాశం ఉన్నది. దీంతో సీఎం ఆర్థికమూలాలను దెబ్బతీసేందుకే బీజేపీ ఐటీ దాడులను చేయిస్తున్నదని రాజకీయవిశ్లేషకులు భావిస్తున్నారు. కాగా రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ యత్నిస్తున్నదని కొంతకాలంగా సీఎం అశోక్ గెహ్లాట్ ప్రకటనలు చేస్తున్నారు. అందుకనుగుణంగానే డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తిరుగుబావుట ఎగురవేశారు. కాగా సచిన్ పైలట్కు బీజేపీతో బేరం కుదరలేదన్న వార్తలు వస్తున్నాయి. అతడికి సీఎం పదవి ఇచ్చేందుకు భారతీయ జనతాపార్టీ సముఖంగా లేదని సమాచారం. ఈ నేపథ్యంలో సచిన్ పైలట్ తన వర్గం ఎమ్మెల్యేలతో బయటకు వెళ్లి సొంతంగా ప్రాంతీయపార్టీని ఏర్పాటు చేస్తాడని కొన్ని మీడియాసంస్థలు కథనాలు ప్రసారం చేశాయి. ఏది ఏమైనా రాజస్థాన్ ప్రస్తుతం గందోరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.