Breaking News

జేఈఈ, నీట్​ పరీక్షల వాయిదాకు సుప్రీం నో


న్యూఢిల్లీ: జేఈఈ, నీట్​ను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ముందుగా నిర్ణయించన ప్రకారమే పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసింది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో జేఈఈ, నీట్​ను వాయిదా వేయాలని 11 మంది విద్యార్థులు సుప్రీంను ఆశ్రయించారు. సోమవారం వారి పిటిషన్​ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం పలు కీలకవ్యాఖ్యలు చేసింది. పరీక్షలు వాయిదా వేస్తే విద్యార్థులు నష్టపోతారని కోర్టు అభిప్రాయపడింది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలను నిర్వహించాలని జస్టిస్​ అరుణ్​ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. వచ్చే ఏడాది కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చు అప్పడు కూడా వాయిదా వేస్తారా? అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. సెప్టెంబర్​ 1 నుంచి 6 వరకు జేఈఈ మెయిన్స్​, సెప్టెంబర్​ 13న దేశవ్యాప్తంగా నీట్​ను నిర్వహించనున్నారు.