![జర్నలిస్టులకు నగదు సాయం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/04/ngkl-marri.21.jpeg?fit=1072%2C712&ssl=1)
సారథి న్యూస్, నాగర్కర్నూల్: జిల్లాకు చెందిన 80 మంది విలేకరులకు రూ.ఐదువేల చొప్పున స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి తన క్యాంపు ఆఫీసులో మంగళవారం అందజేశారు. కరోనా కష్టకాలంలోనూ జర్నలిస్టులు తమ వృత్తికి న్యాయం చేస్తున్నారని ప్రశంసించారు. అంతకుముందు తెలకపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 12మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. మున్సిపల్ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఈశ్వర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ కల్పన పాల్గొన్నారు.