Breaking News

ఘనంగా సుందరయ్య వర్ధంతి

ఘనంగా సుందరయ్య వర్ధంతి

సారథి న్యూస్, నర్సాపూర్: ప్రజాఉద్యమ నేత, సీపీఎం మాజీ అఖిల భారత కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య 35వ వర్ధంతి సందర్భంగా శివంపేట మండలం దొంతి గ్రామంలో స్థానిక సీపీఎం ఆఫీసులో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ మెదక్​ జిల్లా కార్యవర్గసభ్యుడు ఏ.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మతోన్మాదం, సామ్రాజ్యవాదం, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడడమే సుందరయ్యకు అర్పించే నిజమైన నివాళి అన్నారు. తనవంతు భూమిని పేదలకు పంచిన ఆదర్శమూర్తి అని కొనియాడారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొని మూడు లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారని గుర్తుచేశారు. నమ్మిన సిద్ధాంతం కోసం జీవిత కాలమంతా ఉద్యమాలకే అంకితం చేశారన్నారు. కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యుడు శంకర్, దొంతి శాఖ కార్యదర్శి ప్రభాకర్, వసంత పాల్గొన్నారు.