Breaking News

గ్రామాల అభివృద్ధే ధ్యేయం

గ్రామాల అభివృద్ధే ధ్యేయం

సారథి న్యూస్, బెజ్జంకి: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. శనివారం కరీంనగర్​ జిల్లా బెజ్జంకి మండలం ముత్తన్నపేట గ్రామంలో సీసీ రోడ్లు, మహిళా భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. సీఎం కేసీఆర్​కు సంక్షేమ పథకాలు మంచి పేరు తెచ్చిపెట్టాయని అన్నారు. హరితహారం ఒక ఉద్యమంలా సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మల, జడ్పీటీసీ సభ్యురాలు కనగండ్ల కవిత, సర్పంచ్ కనగండ్ల రాజేశం, ఎంపీటీసీ రాజు, ఎంపీడీవో ఓబులేష్​ పాల్గొన్నారు.