![గుప్త నిధుల కోసం తవ్వకాలు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/05/WhatsApp-Image-2020-05-25-at-17.35.18.jpeg?fit=960%2C1280&ssl=1)
సారథి న్యూస్, రంగారెడ్డి: గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన సంఘటన తలకొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తలకొండపల్లి మండలం పరిధిలోని వెల్జాల్ గ్రామంలోని గోవిందరాజుల గుట్ట దేవాలయంలో మాడుగుల మండలానికి చెందిన ముగ్గురు యువకులు గుప్త నిధుల కోసం తవ్వకాలు ప్రయత్నించారు. పక్క సమాచారం మేరకు గ్రామస్తులు, వారిని ట్టుకొని దేహశుద్ధి చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు.
ఇందులో ఒకరు సస్పెండ్ అయిన కానిస్టేబుల్ ఉన్నాడు. ఆలయ నిర్వాహకులు అయ్యప్ప రెడ్డి ఫిర్యాదు మేరకు ఎస్సై సురేష్ యాదవ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.