Breaking News

గాలివాన బీభత్సం

సారథి న్యూస్, హుస్నాబాద్: గాలివాన బీభత్సంతో లక్షలాది విలువైన కోళ్ల ఫామ్ పూర్తిగా దెబ్బతిన్నది. సిద్దిపేట జిల్లా, అక్కన్నపేట మండలం, గుడాటిపల్లి, తెలునుగుపల్లిలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి రేకులు పగిలిపోయాయి. ప్రభుత్వ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఆర్థిక సాయం అందించాలని బాధితులు బోయిని ఎల్లయ్య, బోయిని సుమలత ఆర్డీవో జయచంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు.