Breaking News

కోవిడ్​ 19యాప్​ ఆవిష్కరణ

కోవిడ్ 19యాప్ ఆవిష్కరణ

సారథి న్యూస్​, మేడ్చల్​ : రోజురోజుకు విస్తరిస్తోన్న కరోనా వైరస్​ పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు, అధికారులకు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సూచించారు. శనివారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమయ్యారు. అలాగే కోవిడ్19 అనే కొత్త యాప్ ను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి ఆప్ ద్వారా కరోనా తో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న  పేషంట్ తో వీడియో కాల్ లో వైద్యులు అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. కరోనా సమయంలో వైద్య అధికారులు చేస్తున్న సేవలను ప్రశంసించారు. తగిన జాగ్రత్తలు పాటించి కరోనా వ్యాధి ని నిర్మూలించవచ్చన్నారు.  ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జేసీ విద్యాసాగర్​, పలు వైద్య విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.