Breaking News

కూతురును కాపాడబోయి..

సారథి న్యూస్​, మానవపాడు: కూతురును రక్షించబోయిన ఓ తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామాంజనేయులు (27), కూతురు మానస (4) ఇంటి ముందు ఆడుకుంటోంది.ఈ క్రమంలో ఇంటి ఎదుట ఉన్న ఓ భారీ వృక్షం ఒక్కసారిగా కుప్పకూలింది. చెట్టు కొమ్మలు మీద పడతాయన్న భయంతో తండ్రి రామాంజనేయులు కూతురును రక్షించేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో అతనిపై విద్యుత్​ తీగలు పడడంతో గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం కర్నూలు​లోని రెయిన్​బో దవాఖానకు తరలించారు.