Breaking News

కిక్కు కోసం శానిటైజర్​ తాగి..

నాగ్‌పూర్‌: మద్యం దొరకలేదని శానిటైజర్​ తాగిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మహారాష్ట్రలోని నాగ్​పూర్​కు చెందిన గౌతమ్​ గోస్వామి (45) స్థానిక మున్సిపాలిటీలో క్లీనింగ్​ వర్కర్​గా పనిచేస్తున్నాడు. మద్యం దొరకపోవడంతో శానిటైజర్​ తాగితే కిక్కు వస్తుందని భావించిన గోస్వామి తన ఇంట్లో ఉన్న శానిటైజర్​ను తాగాడు. దీంతో అతడు అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన స్థానికులు అతడిని దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యలు చికిత్సచేసి పంపించారు. రెండ్రోజుల అనంతరం ఆరోగ్యం క్షీణించి మృతిచెందాడు.