Breaking News

కార్మికులు ఏకం కావాలె

కార్మికులు ఏకం కావాలె

– సీపీఐ కరీంనగర్ జిల్లా సహాయ కార్యదర్శి సృజన్

సారథి న్యూస్​, రామడుగు: సంఘటిత, అసంఘటిత కార్మికులు ఏకమై పోరాటాలు చేసి హక్కులు సాధించుకోవాలని సీపీఐ కరీంనగర్ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడా సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం రామడుగు మండల కేంద్రంతో పాటు చిప్పకుర్తి, దేశ రాజ్ పల్లి, గుండి, గోపాల్​ రావుపేట గ్రామాల్లో కార్మిక జెండాను ఎగరవేశారు.

కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్  వలస కార్మికులపై తీవ్రప్రభావం చూపిందన్నారు. వలస కార్మికులను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం హమాలీ కార్మికులకు మాస్క్​ లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి ఉమ్మెతుల రవీందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యుడు మచ్చ రమేష్, జిల్లా నాయకులు గంటే రాజేశం,  నాయకులు ఏగుర్ల మల్లేశం, ముత్యం ఆంజనేయులు గౌడ్, సాయిలు, మల్లేశం పాల్గొన్నారు.