Breaking News

కశ్మీర్​ను వదిలేయ్​.. నీ దేశాన్ని చూస్కో

కశ్మీర్​ను వదిలేయ్​.. నీ దేశాన్ని చూస్కో
  • ఆఫ్రిదిపై టీమిండియా స్టార్​ క్రికెటర్ల ఫైర్​

న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)పై మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టీమిండియా క్రికెటర్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కాశ్మీర్​ను వదిలేసి.. అన్నింటిలో విఫలమైన నీ దేశానికి పనికొచ్చే పని చేయ్. కశ్మీర్.. భారత్​లో భాగంగా ఉన్నందుకు గర్వపడుతున్నా’ అంటూ సురేశ్ రైనా ధ్వజమెత్తాడు. ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలు తనను చాలా బాధించాయని యువరాజ్ పేర్కొన్నాడు. ‘బాధ్యాతయుతమైన భారతీయుడిగా, దేశం తరఫున ఆడిన ఆటగాడిగా ఆఫ్రిది వ్యాఖ్యలను ఏమాత్రం సమర్థించను. మానవత్వంతో నువ్వు అడగగానే నా వంతు సాయం చేశా. ఇప్పుడు సిగ్గు పడుతున్నా’ అని యువీ ట్వీట్ చేశాడు.

‘ప్రపంచమంతా కరోనాపై పోరాడుతున్న ఈ సమయంలోనూ నీ దృష్టంతా కశ్మీర్‌పైనే ఉంది. కాశ్మీర్‌ మాది. ఎప్పటికీ మాతోనే ఉంటుంది. సరే.. నీ 22 కోట్ల మందిని తీసుకురా.. మాలో ఒక్క సైనికుడు మీలో లక్షల మందికి సమానం’ అంటూ ధవన్‌ ట్వీట్‌ చేశాడు.