Breaking News

కర్ణాటక మంత్రి భార్యకు కరోనా

బెంగళూర్‌ : కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం సృష్టిస్తున్నది. సామాన్యులు, ప్రభుత్వాధికారులు, మంత్రులను వదలడం లేదు. తాజాగా కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి కే సుధాకర్​ భార్య, ఆయన కుమార్తెకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ఇటీవలే సుధాకర్​ తండ్రికి పాజిటివ్​ రావడంతో ఆయన కుటుంబసభ్యులకు కరోనా పరీక్షలు చేశారు. తమ కుటుంబ సభ్యులకు నిర్వహించిన కోవిడ్‌-19 టెస్ట్‌ రిపోర్టులు వచ్చాయని, తన భార్య కుమార్తెకు పాజిటివ్‌ ఫలితాలు వచ్చాయని మంత్రి ట్వీట్​ చేశారు. ప్రస్తుతం వారిద్దరూ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారన్నారు. అయితే తనకు తన ఇద్దరు కుమారులకు కరోనా నెగిటివ్​ వచ్చినట్టు మంత్రి చెప్పారు.