Breaking News

కరోనా.. భయం వద్దు

సారథి న్యూస్​, ఖమ్మం: జిల్లాలోని మధిర మండలం మహాదేవపురం గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో జడ్పీ చైర్మన్​ లింగాల కమల్ రాజు మంగళవారం గ్రామాన్ని సందర్శించి స్థానికులకు మాస్క్​లు, శానిటైజర్లు పంపిణీచేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కూలీకి అక్కడి లోకల్​ కాంటాక్ట్ ద్వారా కరోనా వ్యాప్తి చెందిందని చెప్పారు. బాధితులను గాంధీ ఆస్పత్రికి తరలించి ట్రీట్​మెంట్​ చేయిస్తున్నామని చెప్పారు. ఆయన వెంట ఎంపీపీ మెండేం లలిత, టీఆర్ఎస్ నాయకులు వాసిరెడ్డి నాగేశ్వరరావు, సీఐ వేణుమాధవ్, ఎస్సై ఉదయ్ కుమార్, తహసీల్దార్​ సైదులు, ఎండీవో శంకర్, ఈవోఆర్డీ రాజారావు ఉన్నారు.