![కరోనా పేషెంట్పై లైంగికదాడి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/GIRLLL-CARONAAA-DELHI.jpg?fit=290%2C174&ssl=1)
ఢిల్లీ: కరోనాతో బాధపడుతూ దవాఖానలో చేరిన ఓ బాలిక(14)ను మరో కరోనా పేషెంట్ లైంగికంగా వేధించాడు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని కోవిడ్ కేర్సెంటర్లో గురువారం వెలుగుచూసింది. ఢిల్లీకి చెందిన ఓ బాలికకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో కోవిడ్ సెంటర్లో చికిత్సపొందుతున్నది. కాగా అక్కడే చికిత్సపొందుతున్న మరో కరోనా బాధితుడు బాలికపై టాయిలెట్రూంలో లైంగికదాడికి యత్నించాడు. ఈ దృశ్యాన్ని మరో వ్యక్తి తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించాడు. బాలిక కేకలు పెట్టడంతో ఇతర రోగులు అక్కడికి చేరుకొని కాపాడారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడిని ఢిల్లీలోని మరో దవాఖానకు తరలించారు. కరోనా నుంచి కోలుకోగానే కస్టడీలోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.