Breaking News

కరోనా కేసులు @ 8 లక్షలు

ఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్నది. కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన గణాంకాల
ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 8,20,916 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 27,114 మందికి కరోనా సోకింది. దేశవ్యాప్తంగా 2,83,407 యాక్టివ్​ కేసులుండగా, ఇప్పటివరకు 22,123 మంది కరోనాకు బలయ్యారు. 5,15,385 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. కోలుకుంటున్న వారి సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ.. రోజురోజుకు పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజలంతా భౌతికదూరం పాటించి మాస్కులు ధరించాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని కేంద్ర ఆరోగ్యశాఖ మరోసారి సూచించింది. కరోనా వ్యాక్సిన్​కోసం దేశవ్యాప్తంగా పలుసంస్థలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయని చెప్పంది. మరికొన్ని నెలల్లోనే వ్యాక్సిన్​ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నదని స్పష్టం చేసింది.