Breaking News

కరోనా కలవరం

30 మంది క్వారంటైన్​

సారథి న్యూస్​, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ తో పాటు సిర్గాపూర్, కంగ్టి, కల్హేర్, మనూర్, నాగుల్ గిద్ద మండలాల ప్రజలను కరోనా మహమ్మారి భయం వెంటాడుతోంది. హైదరాబాద్ లోని ఓ బేకరీలో గరిడేగావ్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పనికి వెళ్లాడు. ఈనెల 10న సొంతూరుకు తీవ్రమైన జ్వరంతో వచ్చాడు. జ్వరం తగ్గకపోవడంతో మూడు రోజుల క్రితం హైదరాబాద్​లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు కరోనా పాజిటివ్ ఉందని నిర్ధారించారు. స్థానిక డాక్టర్లు, పోలీసు సిబ్బంది గ్రామానికి చేరుకుని స్థానికులకు అవగాహన కల్పించి అప్రమత్తం చేశారు.

30 మంది క్వారంటైన్​
సదరు వ్యక్తి ఎవరెవరిని కలిశారనే వివరాలు సేకరించిన అధికారులు వైద్యపరీక్షల కోసం 30 మందిని క్వారంటైన్​ కు తరలించారు. కంగ్టి మండల కేంద్రంతో పాటు ముర్కున్ జాల్, రసోల్ తో పాటు చాప్టా(కే)గ్రామంలో ఓ వేడుకకు అతడు వచ్చినట్లు గుర్తించారు. ఈ పరిణామాణాల నేపథ్యంలో నారాయణఖేడ్​ డివిజన్​ లోని అన్ని గ్రామాల్లో పది రోజుల పాటు స్వచ్ఛందంగా బంద్​ నిర్వహించుకుంటున్నారు. ప్రతిఒక్కరూ మాస్క్​ కట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని, నారాయణఖేడ్ ఆర్డీవో అంబాదాస్ రాజేశ్వర్ సూచించారు. మాస్క్​ లేకపోతే రూ.వెయ్యి ఫైన్​ విధిస్తామని హెచ్చరించారు.