![కరోనా కలకలం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/04/WhatsApp-Image-2020-04-19-at-7.40.20-PM.jpeg?fit=1232%2C816&ssl=1)
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/04/crop-0-0-1232-816-0-WhatsApp-Image-2020-04-19-at-7.40.20-PM.jpeg?resize=640%2C424&ssl=1)
సారథి న్యూస్, సూర్యాపేట: సూర్యపేట జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు జిల్లా వాసులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. జిల్లాలోని నాగారం మండలం వర్ధమానుకోట, తిరుమలగిరి, చివ్వెంల మండలం బిబిగూడెం, నేరేడుచర్ల, పెన్పహాడ్, సూర్యాపేట పట్టణంలో మొత్తం 54 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం వరకు 713 శాంపిళ్లు సేకరించారు. అందులో ఆదివారం రోజు 40 మంది అనుమానితులు శాంపిల్స్ ఉన్నారు. ఇందులో 200 మంది రిపోర్టులు నెగిటివ్ వచ్చాయి. మిగతా వారి నివేదికలు రావాల్సి ఉంది. ప్రభుత్వ క్వారంటైన్ లో మొత్తం 284 మంది ఉన్నారు. హోమ్ క్వారం టైన్ లో 773 మందిని ఉంచారు. అయితే ఇప్పటి వరకు జిల్లాలో ఒక మృతి కేసు కూడా నమోదు కాలేదు.