Breaking News

కరోనాతో మాజీ ఫుట్​బాలర్​ మృతి

కొజికోడ్: రోజురోజుకూ విజృంభిస్తున్న కరోనా దెబ్బకు.. భారత మాజీ ఫుట్​బాల్​ ప్లేయర్​ హమ్జాకోయ మృత్యువాతపడ్డాడు. గతనెల 26న కరోనా లక్షణాలు కనిపించడంతో మల్లాపురంలోని మంజేరి మెడికల్ కాలేజీ హాస్పిటల్​లో చేరాడు. రెండు రోజుల తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో డాక్టర్లు వెంటిలేటర్​పై ఉంచి చికిత్స ఇచ్చారు. అయితే కరోనా నుంచి కోలుకోలేకపోయిన హమ్జా శనివారం తుదిశ్వాస విడిచాడు. హమ్జా కుటుంబసభ్యుల్లో కూడా ఐదుగురికి పాజిటివ్ అని తేలడంతో చికిత్స అందిస్తున్నారు. గతనెల 21న ముంబై నుంచి కేరళకు వెళ్లే సమయంలో వైరస్ అంటి ఉండొచ్చని కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముంబైలోని పలు ఫుట్​బాల్​ క్లబ్స్​కు ప్రాతినిథ్యం వహించిన 61ఏళ్ల హమ్జా.. సంతోష్ ట్రోఫీలో మహారాష్ట్ర తరఫున ఆడాడు.