Breaking News

కరోనాతో మరో ఎమ్మెల్యే మృతి

షార్ట్ న్యూస్

భారత్​లో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో15,968మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,56,183 కు చేరింది. గత 24 గంటలలో కరోనాతో 465 మంది మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 14,476కు చేరింది. ఇప్పటివరకు 2,58,685 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 1,83,022 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్ కరోనాతో బుధవారం ఉదయం మరణించారు. టీఎంసీ కోశాధికారి, మూడుసార్లు ఎమ్మెల్యే అయిన తమోనాష్ ఘోష్ తమను వీడి పోవడం తీవ్ర విషాదం నింపిందని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ట్వీట్ చేశారు.