![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/CARONA-NGKL-NGKL-NGKLF.jpg?fit=2560%2C1902&ssl=1)
సారథిన్యూస్, నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. ఇప్పటికే జిల్లాకు చెందిన ముగ్గురికి కరోనా సోకగా.. తాజాగా జిల్లా దవాఖానలో ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు. నాగర్కర్నూల్, కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానలో పనిచేస్తున్న మొత్తం 27 మంది నమూనాలను పరీక్షించగా.. అందులో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న ఒక స్టాఫ్ నర్స్ కు, సెక్యూరిటీ సిబ్బంది కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు కలెక్టర్ తెలిపారు. ఇద్దరికి సంబంధించిన ప్రైమరీ కాంటక్ట్స్ ను గుర్తించాలని సిబ్బందిని ఆదేశించారు.